కాంగ్రెస్ లోకి భారీ వలసలు : బాలూనాయక్​

కాంగ్రెస్ లోకి భారీ వలసలు : బాలూనాయక్​

దేవరకొండ,వెలుగు:  ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్​లోకి భారీ వలసలు కొనసాగాయి. బీఆర్​ఎస్ కు చెందిన పలువురు సర్పంచులు, కౌన్సిలర్లు గురువారం కాంగ్రెస్ అభ్యర్ధి బాలూనాయక్​ సమక్షంలో కాంగ్రెస్​ పార్టీలో చేరారు.  మండలంలోని శేరిపల్లి పెద్దతండా సర్పంచ్​ రమావత్​ పద్మ తుల్చానాయక్,  పట్టణ కౌన్సిలర్​ గాజుల మురళి,  యాదవసంఘం ఆధ్వర్యంలో పలువురు యాదవులు, మడ్​మడ్​ గ్రామానికి చెందిన పలు కుటుంబాలు పార్టీలో చేరాయి. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ నర్సింహ్మ,  దేవేందర్​నాయక్​, శ్రీధర్​రెడ్డి, కౌన్సిలర్లు భాగ్యలక్ష్మి, శ్రీనివాస్,  మల్లీశ్వరి శ్రీశైలంయాదవ్​ తదితరులు పాల్గొన్నారు.
 
కాంగ్రెస్ లోకి జడ్పీటీసీ

చౌటుప్పల్:  బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు భారీగా కాంగ్రెస్ లో  చేరారు. బీజేపీ నాయకులు, చౌటుప్పల్​ జడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్ రెడ్డి , కాంగ్రెస్ నాయకులు ఉబ్బు వెంకటయ్య ,  మొగుదాల రమేశ్, లక్కారం  కౌన్సిల ర్ కొయ్యడ్ సైదులు గౌడ్, కాసర్ల శ్రీనివాస్ రెడ్డి , పోలోజు అనిల్ , రావుల స్వామి  చింతల సాయిల్, కొండూరు వెంకన్న గౌడ్, బత్తుల లింగస్వామి, 100 మంది వివిధ పార్టీల కార్యకర్తలు గురువారం పట్టణ అధ్యక్షుడు నరసింహ గౌడ్  ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు. కార్యక్రమంలో ఆకుల ఇంద్రసేనారెడ్డి, బోయ దేవేందర్, కేతరాజు అచ్చయ్య,  ముప్పిడి సైదులు గౌడ్, పందుల రాజేశ్ గౌడ్, మల్కాపురం నరసింహ, నరసింహ, కళ్లెం దయాకర్, బండమీది వెంకటేశ్​, యూసుఫ్, పెద్దగోని రమేశ్ గౌడ్,  వెలుగు రాంబాబు,   తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : కేసీఆర్ తోనే ప్రజా సంక్షేమం : జగదీశ్ రెడ్డి