హైదరాబాద్, వెలుగు : విత్తన ఉత్పత్తి కంపెనీ కావేరీ సీడ్ కంపెనీ లిమిటెడ్ ఈ ఏడాది సెప్టెంబరుతో ముగిసిన రెండో క్వార్టర్లో రూ.10.72 కోట్ల లాభాన్ని ఆర్జించింది. 2022 రెండో క్వార్టర్లో రూ.2.72 కోట్లు ఆర్జించింది. ఈక్విటీ షేర్కు రూ.5 చొప్పున మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది. హైదరాబాద్కు చెందిన ఈ కంపెనీకి తాజా క్వార్టర్లో రూ.96.12 కోట్ల ఆదాయం వచ్చింది.
గత ఏడాది రెండో క్వార్టర్లో రూ.84.49 కోట్లు వచ్చాయి. గ్లోబల్గా బియ్యం ధరల పెరుగుదల వల్ల మేలు జరిగిందని, కూరగాయల వ్యాపారంలోనూ విజయాలు సాధించామని కావేరీ సీడ్స్ సీఎండీ జీవీ భాస్కర్ రావు అన్నారు. కంపెనీ ఇప్పుడు టాంజానియా, అల్జీరియా, ఐవరీ కోస్ట్, థాయిలాండ్ తదితర దేశాల మార్కెట్లపై దృష్టి సారించింది.