సాగర్ కాల్వలోకి దూసుకెళ్లిన పెళ్లి బస్సు.. ఏడుగురు మృతి

సాగర్ కాల్వలోకి దూసుకెళ్లిన పెళ్లి బస్సు.. ఏడుగురు మృతి

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దర్శి సమీపలో  పెళ్లి బస్సు సాగర్ కెనాల్ లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా మరో 12 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ఐదుగురు మహిళలు, చిన్నారి, ఓ వృద్ధుడు ఉన్నారు. బస్సు పొదిలి  నుంచి కాకినాడకు రిసెప్షన్ కు  వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 30 నుంచి 40 ఉన్నట్లు సమాచారం.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతులు అజీజ్,అబ్దుల్ హాని,షేక్ రమీజ్,ముల్లా నూర్జహాన్, ముల్లా జానీబేగం, షేక్ షబీనా, షేక్ హసీనగా గుర్తించారు. బస్సు డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటంతోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.