ఏం తల్లిరా బాబూ : పాప ఏడుస్తుందని.. మందు పట్టింది

ఏం తల్లిరా బాబూ : పాప ఏడుస్తుందని.. మందు పట్టింది

బిడ్డ ఏడిస్తే పాలివ్వడం అందరూ తల్లులు చేసే పని. కానీ ఈ తల్లి మరోసారి బిడ్డ ఏడవకూడదు అనుకుందేమో! ఏకంగా మందు పట్టింది. ఈ షాకింగ్ ఘటన కాలిఫోర్నియాలో వెలుగు చూసింది.

కాలిఫోర్నియాకు చెందిన హోనెస్టి డి లా టోర్రే(37) అనే మహిళ.. తన 7 వారాల పాప ఏడుపు ఆపడానికి మద్యం పట్టింది. ఈ ఘటన రెండ్రోజుల క్రితం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. డి లా టోర్రే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు పాప పదే పదే ఏడుస్తోంది. దీంతో ఆ చిన్నారి ఏడుపు ఆపడానికి పాల డబ్బాలో ఆల్కహాల్ నింపింది. దానిని సేవించిన ఆ చిన్నారి మత్తులోకి జారుకుని.. అనారోగ్యం పాలైంది. దాంతో ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆ చిన్నారికి చికిత్స అందుతోంది.

పాప ఏడుపు ఆపాలనే ఉద్దేశ్యంతో తల్లి పాల సీసాలో మద్యం నింపిందని తెలుసుకొని అధికారులు ఆశ్చర్యపోయారు. చిన్నారి జీవితానికి ముప్పు కలిగించిందన్న దానిపై పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.