
హనుమకొండ సిటీ/ జనగామ అర్బన్, వెలుగు: ప్రజా యుద్ధనౌక గద్దర్ జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని ప్రొఫెసర్ కంచె అయిలయ్య అన్నారు. బుధవారం హనుమకొండ హరిత కాకతీయలో గద్దర్ 2వ వర్ధంతి కార్యక్రమం గద్దర్ ఫౌండేషన్, కళాకారుల ఆధ్వర్యంలో నిర్వహించగా, ఆయన చీఫ్గెస్ట్గా హాజరై మాట్లాడారు.
అనంతరం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పసునూరి రవీందర్, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి మాట్లాడుతూ తెలంగాణలో గద్దర్ విగ్రహాలను ఏర్పాటు చేయాలన్నారు. గద్దర్ వర్ధంతి సందర్భంగా జనగామ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నివాళులర్పించారు.