
జడ్చర్ల, వెలుగు: మందపైకి కారు దూసుకెళ్లడంతో గొర్లు చనిపోయిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి జడ్చర్ల వైపు స్పీడ్ గా వెళ్తున్న కారు గొల్లపల్లి సమీపంలో హైవే – 44 పక్కన గొర్ల మందపైకి దూసుకెళ్లింది. ధన్వాడ మండలం యనాన్ పల్లికి చెందిన మహేశ్16 గొర్లు స్పాట్ లో చనిపోయాయి. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సీఐ కమలాకర్ తెలిపారు.