సీబీఎస్‌ఈ ఎగ్జామ్స్‌ క్యాన్సిల్‌

సీబీఎస్‌ఈ ఎగ్జామ్స్‌ క్యాన్సిల్‌
  • సుప్రీం కోర్టుకు చెప్పిన కేంద్రం
  • 12వ తరగతి వారికి ఆప్షన్‌ ఇచ్చిన ప్రభుత్వం

న్యూఢిల్లీ: కరోనా ప్రబలుతున్న కారణంగా సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) ఎగ్జామ్స్‌ను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు చెప్పింది. సీబీఎస్‌ఈ ఎగ్జామ్స్‌ నిర్వహణపై సుప్రీం కోర్టులో గురువారం విచారణ జరిగిన సందర్భంగా ప్రభుత్వం తరఫున హాజరైన తుషార్‌‌ మెహతా ఈ విషయాన్ని కోర్టుకు చెప్పారు. జులై 1 నుంచి 15 వరకు జరగాల్సిన సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షలు రద్దు చేస్తున్నట్లు చెప్పారు. వాటితో పాటు ఐసీఎస్‌ఈ పరీక్షలను కూడా క్యాన్సిల్‌ చేశామని అన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు తో పాటు మరికొన్ని రాష్ట్రాలు ఎగ్జామ్స్‌ నిర్వహించే పరిస్థితులు లేవని చెప్పాయని, పరిస్థితులు చక్కదిద్దుకున్న తర్వాత నిర్వహించాలని డిసైడ్‌ అయ్యామని అన్నారు. అయితే 12వ తరగతి స్టూడెంట్స్‌కు మాత్రం ఆప్షన్‌ ఇచ్చారు. ఎగ్జామ్‌కు హాజరవ్వాలా? లేక ఇంటర్నల్‌ మార్క్స్‌ ఆధారంగా సర్టిఫికెట్స్‌ తీసుకోవాలా అనేది స్టూడెంట్స్‌ డిసైడ్‌ అవ్వొచ్చని అన్నారు. ఆ ఫలితాలను జులై 15న ప్రకటిస్తామని చెప్పారు. సీబీఎస్‌ఈ నిర్వహించే ప్రవేశ పరీక్షలకు సంబంధించి శుక్రవారం లోగా నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు చెప్పారు. ఒక వేళ ఆగస్టులో రిజల్ట్స్‌ ప్రకటిస్తే సెప్టెంబర్‌‌ నుంచి కొత్త విద్యాసంవత్సరం ప్రారంభిస్తామని అన్నారు.