- కర్నాటక సీఎం సిద్ధూ విమర్శలు
బెంగళూరు: రాష్ట్రానికి కరువు నిధులను విడుదల చేయకపోవ డంతో కేంద్రాన్ని కర్నాటక సీఎం సిద్ధ రామయ్య విమర్శించారు. ఉపాధి హామీ పనిదినాలను 100 నుంచి 150కు పెంచాలని విజ్ఞప్తి చేసినా కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ పథకం పెండింగ్ బిల్లులు రూ.1600 కోట్ల ను రిలీజ్ చేయలేదన్నారు. ‘కరువు నివారణకు రూ.18,172 కోట్లు ఇవ్వాలని గతేడాది అక్టోబర్ 20న మెమోరాండం ఇచ్చాం. కానీ ఇప్పటి వరకు కేంద్రం ఒక్క పైసా కూడా ఇవ్వలేదు.కేంద్రాన్ని నిధులు అడిగినప్పుడల్లా కాంగ్రెస్ సర్కారు ను రాష్ట్ర బీజేపీ విమర్శిస్తోంది’ అని సిద్ధ రామయ్య మండిపడ్డారు.