టెన్త్‌‌తో సెంట్రల్‌‌ కానిస్టేబుల్స్‌‌

టెన్త్‌‌తో సెంట్రల్‌‌ కానిస్టేబుల్స్‌‌

స్టాఫ్‌‌‌‌ సెలెక్షన్‌‌‌‌ కమిషన్‌‌‌‌ 25,271 కానిస్టేబుల్‌‌‌‌ (జనరల్‌‌‌‌ డ్యూటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌‌‌‌ రిలీజ్​ చేసింది. పదో తరగతి పాసైతే చాలు కేంద్ర పారామిలిటరీ బలగాల్లో కొలువు కొట్టొచ్చు.   సెంట్రల్‌‌‌‌ ఆర్మ్‌‌‌‌డ్‌‌‌‌ పోలీస్​ ఫోర్స్‌‌‌‌, నేషనల్‌‌‌‌ ఇన్వెస్టిగేషన్‌‌‌‌ ఏజెన్సీ, సెక్రటేరియల్‌‌‌‌ సెక్యూరిటీ ఫోర్స్‌‌‌‌, రైఫిల్‌‌‌‌మెన్‌‌‌‌ ఇన్‌‌‌‌ అసోం రైఫిల్స్‌‌‌‌లో కానిస్టేబుల్​ పోస్టులు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 31వ తేదీ లోపు అప్లై చేసుకోవచ్చు.

పదో తరగతి తర్వాత పోలీస్​ విభాగంలో చేరాలనుకునే అభ్యర్థులకు పారామిలటరీ బలగాల నోటిఫికేషన్​ మంచి అవకాశం. ఈ ఉద్యోగాల భర్తీని స్టాఫ్​ సెలెక్షన్​ కమిషన్​  చేపడుతుంది. 

మొత్తం ఖాళీలు: 25, 271(బీఎస్​ఎఫ్​ - 7545,  సీఐఎస్​ఎఫ్​ - 8464, ఎస్​ఎస్​బీ - 3806, ఐటీబీపీ - 1431, ఏఆర్​ - 3785, ఎస్ఎస్ఎఫ్ - 240)
సెలెక్షన్​ ప్రాసెస్​: కంప్యూటర్‌‌‌‌ ఆధారిత పరీక్ష, ఫిజికల్‌‌‌‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌‌‌‌, పీఎస్‌టీ, మెడికల్​ టెస్ట్.
ఫిజికల్​ టెస్ట్​: పురుషులు 24 నిమిషాల్లో 5 కిలోమీటర్లు, మహిళలు 8.1/2 నిమిషాల్లో 1.6 కిలోమీటర్లు పరుగెత్తాలి. .
ఎగ్జామ్​ ప్యాటర్న్​: కంప్యూటర్​ బేస్డ్​ పరీక్షలో ఎగ్జామ్​ ఉంటుంది.  90 నిమిషాల్లో 100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. మొత్తం నాలుగు విభాగాలు ఉంటాయి. జనరల్​ ఇంటెలిజెన్స్​ అండ్​ రీజనింగ్(25 మార్కులు)​, జనరల్​ నాలెడ్జ్​ అండ్​ జనరల్ అవేర్​నెస్ (25 మార్కులు)​, ఎలిమెంటరీ మ్యాథ్స్ (25 మార్కులు)​ఇంగ్లిష్​/హిందీ (25 మార్కులు) ఉంటాయి.

మ్యాథ్స్‌‌పై ఫోకస్ చేయాలి
ఎస్ఎస్‌‌సీ కానిస్టేబుల్ కొలువు కొట్టాలంటే మ్యాథ్స్‌‌పై ఎక్కువ ఫోకస్ చేయాలి. 50శాతం మార్కులు అర్థమెటిక్ మీదే అడుగుతారు. ఫిట్‌‌నెస్‌‌ కోసం డైట్ ఫాలో అవ్వాలి.  గ్రౌండ్ ప్రాక్టీస్ క్రమం తప్పకుండా చేయాలి. 
- బండి మనోజ్ కుమార్, సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్ (2015 బ్యాచ్)

అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత. 
వయసు: 18-23 ఏండ్లు.
దరఖాస్తులు: ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో అప్లై చేయాలి.
చివరితేది: 31 ఆగస్టు 
సీబీటీ ఎగ్జామ్​: త్వరలో ప్రకటిస్తారు.
వెబ్‌‌‌‌సైట్‌‌‌‌: www.ssc.nic.in