అధికారుల బదిలీలను పకడ్బందీగా చేయాలి: ఈసీఐ

 అధికారుల బదిలీలను పకడ్బందీగా చేయాలి: ఈసీఐ

న్యూఢిల్లీ, వెలుగు: రాబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అధికారుల బదిలీల పాలసీని పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్రాలు/యూటీలను కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) ఆదేశించింది. ఈ మేరకు ఈసీఐ జేడీ అనూజ్ చందక్ శనివారం రాష్ట్రాలు, యూటీలకు లేఖలు రాశారు.

రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని పక్కపక్క జిల్లాల్లో అధికారులను బదిలీ/పోస్టింగ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నా రు. కేవలం 2 పార్లమెంట్ నియోజక వర్గాలు ఉన్న రాష్ట్రాలు/యూటీల్లో మినహా.. అన్ని రాష్ట్రాలు బదిలీ చేసిన అధికారులు.. అదే నియోజకవర్గంలో పోస్టింగ్ పొందకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.