కేంద్ర ప్రభుత్వం రైల్వే డబ్లింగ్​ పనులకు గ్రీన్ సిగ్నల్​

కేంద్ర ప్రభుత్వం  రైల్వే డబ్లింగ్​ పనులకు గ్రీన్ సిగ్నల్​

నిజామాబాద్/ కామారెడ్డి, వెలుగు: ఉమ్మడి నిజామాబాద్​ జిల్లా మీదుగా ప్రస్తుతమున్న  రైల్వే సింగిల్​లైన్​ను డబ్లింగ్​లైన్​గా మార్చేందుకు  కేంద్ర ప్రభుత్వం గ్రీన్​ సిగ్నల్​ఇచ్చింది. సికింద్రాబాద్ ​నుంచి ఉత్తర భారత దేశానికి కామారెడ్డి, నిజామాబాద్​ జిల్లాల మీదుగా ప్రస్తుతం సింగిల్​లైన్​ ఉంది. సికింద్రాబాద్​నుంచి మేడ్చల్​వరకు ఇదివరకే డబ్లింగ్​పనులు కంప్లీటయ్యాయి. 

మహారాష్ట్రలోని ముథ్కేడ్​ నుంచి ఏపీలోని డోన్​ డబ్లింగ్ ​ప్రాజెక్ట్​కు కేంద్ర క్యాబినేట్​ఆమోదం తెలిపినట్లు నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ బుధవారం మీడియాకు వెల్లడించారు. సికింద్రాబాద్​ వైపు నుంచి ఉమ్మడి నిజామాబాద్​ జిల్లా మీదుగా ప్రతీరోజు  40 ఎక్స్​ప్రెస్, ప్యాసింజర్​ రైళ్లు అటుఇటు తిరుగుతున్నాయి. గూడ్స్​రైళ్లు 10 వరకు వెళ్తాయి.