
- కరోనా ఇంకా పోలే: కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ఇంకా పోలేదని, వచ్చే పండుగల సీజన్లో గైడ్లైన్స్ కచ్చితంగా అమలయ్యేలా చూడాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. పండుగల సందర్భంగా జనం నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే కరోనా మళ్లీ తీవ్రమయ్యే డేంజర్ ఉందని హెచ్చరించారు. మహమ్మారి కట్టడికి వ్యాక్సినేషన్లో వేగం పెంచాలని ఆదేశించారు. దేశంలో ఇప్పటికే 94 కోట్ల డోసులు వేశామని, దసరా లోపే 100 కోట్ల డోసులు వేయాలని కేంద్ర ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుందని వివరించారు. త్వరలోనే ఈ టార్గెట్ను అందుకుంటామని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈమేరకు ప్రధాన రాష్ట్రాల ప్రిన్సిపాల్ సెక్రటరీలు, నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్లతో వ్యాక్సినేషన్పై కేంద్ర మంత్రి శనివారం రివ్యూ చేశారు. వ్యాక్సినేషన్ను స్పీడప్ చేయడం, కరోనా గైడ్లైన్స్ను తప్పకుండా పాటించడంతోనే వైరస్ను అదుపుచేయగలమని స్పష్టంచేశారు. 8 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు రాష్ట్రాల వద్ద పెండింగ్లో ఉన్నాయని మంత్రి మన్సుక్ మాండవీయ చెప్పారు. ఏపీ, తెలంగాణ, అస్సాం, బీహార్, చత్తీస్గఢ్, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బెంగాల్ అధికారులు రివ్యూలో పాల్గొన్నారు.