కేంద్ర హోంమంత్రి అమిత్ షా మళ్లీ ఆస్పత్రిలో చేరారు. కరోనా నుంచి కోలుకొని ఆగష్టు 14న గురుగ్రాంలోని మేదాంత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కాగా.. తాజాగా ఆయన మళ్లీ ఢిల్లీలోని ఎయిమ్స్ లో అడ్మిట్ అయ్యారని కేంద్ర హోంమంత్రి కార్యాలయం తెలిపింది. ఆయన ఆస్పత్రి నుంచే తన విధులు నిర్వర్తిస్తారని తెలిపింది. గత మూడు, నాలుగు రోజుల నుంచి అమిత్ షా.. నీరసం మరియు బాడీ పెయిన్స్ తో బాధపడుతున్నారని.. అందుకే ఈ రోజు ఎయిమ్స్ లో చేరారని ఆయన కార్యాలయ సిబ్బంది తెలిపారు.
For More News..