భువనగిరి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం : చామల కిరణ్ కుమార్ రెడ్డి

భువనగిరి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం :  చామల కిరణ్ కుమార్ రెడ్డి

సూర్యాపేట, వెలుగు : పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. భువనగిరి ఎంపీ టికెట్​ దక్కడంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని శుక్రవారం ఆయన కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం ఉమ్మడి నల్గొండ జిల్లా అగ్రనాయకులు మాజీ మంత్రి జానారెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితోపాటు పార్టీ పెద్దలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భగా కిరణ్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకు కార్యకర్తలు కృషిచేయాలని కోరారు. పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రచార వ్యూహాలు రూపొందించాలని,  గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రచారం  చేయాలని సూచించారు.