హైదరాబాద్: రాష్ట్రంలో మరో మూడ్రోజులు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. తూర్పు విదర్భ నుండి తెలంగాణ , రాయలసీమ మీదుగా ఇంటీరియర్ తమిళనాడు వరకు సముద్ర మట్టం నుండి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉన్న ఉపరితల ద్రోణి ఈరోజు కూడా స్థిరంగా కొనసాగుతోందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ద్రోణి ప్రభావంతో రాగల మూడు రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. అలాగే ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులతో మరికొన్నిచోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని.. గంటకు 30 నుండి 40 కి మీ వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షములు కొన్ని జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది.
ఇవి కూడా చదవండి
ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రశాంత్ కిషోర్