అన్యాయం జరుగుతుంటే నేతాజీ ప్రతిరూపాలై పోరాడాలి

అన్యాయం జరుగుతుంటే నేతాజీ ప్రతిరూపాలై పోరాడాలి

నేతాజీ ప్రతిరూపాలై అన్యాయంపై పోరాడాలన్నారు టీడీపీ అధినేత‌ చంద్రబాబు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులు అర్పిస్తున్నానని చంద్రబాబు తెలిపారు. అన్యాయంతో రాజీపడడం అంటే మనం అతిపెద్ద నేరం చేసినట్టేనని నేతాజీ అన్నారనిజ.. ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే మనం ఎందుకు ఊరుకోవాలి? నేతాజీ ప్రతిరూపాలై ఆ అన్యాయంపై పోరాడాలి అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

తన అభ్యుదయ భావాలతో యువతరానికి చిరస్మరణీయ స్ఫూర్తిని అందించిన సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని కీర్తించారు. ఈ ఏడాది సుభాష్ చంద్రబోస్ జయంతి రోజైన జనవరి 23 నుంచే దేశ గణతంత్ర దినోత్సవాలు జరుపుకోవాలని కేంద్రం నిర్ణయించడం హర్షణీయమని చంద్రబాబు తెలిపారు.