ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం కాకతీయ యూనివర్శిటీ నిర్వహించే ఐసెట్ (ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) కౌన్సెలింగ్ షెడ్యూల్లో మార్పులు చేశారు. ఆగస్టు 14 నుంచి జరగాల్సిన ఐసెట్ కౌన్సెలింగ్ను వాయిదా వేశారు.
కొత్త షెడ్యూల్ ప్రకారం.. సెప్టెంబర్ 6వ తేదీ నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 8 నుంచి 12వ తేదీ వరకు అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు. సెప్టెంబర్ 8 నుంచి 13 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవడానికి సమయం ఇచ్చారు.
సెప్టెంబర్ 17వ తేదీన ఎంబీఏ, ఎంసీఏ తొలి విడుత సీట్లను కేటాయించనున్నారు. సెప్టెంబర్ 22 నుంచి ఐసెట్ తుది విడుత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
28న ఎంబీఏ, ఎంసీఏ తుది విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. సెప్టెంబర్ 29న స్పాట్ ప్రవేశాలకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు కాకాతీయ వర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది.
?టీఎస్ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు జరిగాయి
— DD News Telangana | తెలంగాణ న్యూస్ (@ddyadagirinews) August 12, 2023
?ఈ నెల 14 నుంచి జరగాల్సిన ఐసెట్ కౌన్సెలింగ్ను వాయిదా వేశారు
?సెప్టెంబర్ 6 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. pic.twitter.com/qnEwIg6TSs