ఆన్​ లైన్​ ఛీటింగ్​ : ఫర్నిచర్​ అమ్ముతామంటూ 1.30 లక్షల మోసం

ఆన్​ లైన్​ ఛీటింగ్​ : ఫర్నిచర్​ అమ్ముతామంటూ 1.30 లక్షల మోసం

బషీర్​బాగ్, వెలుగు: ఫర్నిచర్​అమ్ముతామంటూ సైబర్​నేరగాళ్లు సిటీకి చెందిన ఓ మహిళను మోసగించారు. విడతల వారీగా రూ.1.30లక్షలు కొట్టేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపిన వివరాల ప్రకారం.. సిటీకి చెందిన ఓ మహిళ ఇటీవల క్విక్కర్ యాప్​లో సెకండ్​హ్యాండ్​ఫర్నిచర్​కు సంబంధించిన యాడ్​చూసింది. అక్కడ మెన్షన్​చేసిన ఫోన్​నంబర్​కు కాల్​చేసింది. 

ఆర్మీ ఆఫీసర్​పేరుతో ఓ వ్యక్తి మహిళతో మాట్లాడాడు. ఫర్నిచర్ అందుబాటులో ఉందని.. ముందుగా 20 శాతం డబ్బులను చెల్లించాలని సూచించాడు. దీంతో మహిళ మొదట రూ.5 వేలు చెల్లించింది. తర్వాత ల్యాప్​టాప్​కూడా అమ్ముతామనడంతో రూ.9వేలు, డోర్​డెలివరీ చేస్తామనడంతో ఇంకో రూ.10వేలు పంపింది. జీఎస్టీ, డెలివరీ చార్జీలు ఉంటాయనడంతో మరో రూ.16,400 ట్రాన్స్​ఫర్​చేసింది. మరికొన్ని వస్తువులు ఇస్తామని ఆశచూపడంతో  రూ.48వేలు పంపింది. మళ్లీ.. డబ్బు అడగడంతో మహిళ స్కామ్ అని గ్రహించింది. రూ.1,30,209 మోసపోయానని ఆన్​లైన్​లో సైబర్​ పోలీసులకు ఫిర్యాదు చేసింది.