నీళ్ల కోసం రోడ్డెక్కిన చెంచులు

నీళ్ల కోసం రోడ్డెక్కిన చెంచులు

అచ్చం పేట, వెలుగు: మంచినీటి కోసం చెంచు గిరిజనులు రోడ్డెక్కారు. బల్మూర్  మండల కేంద్రంలోని చెంచు కాలనీలో పది రోజులుగా మంచినీళ్లు సప్లై కావడం లేదని ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన తెలిపారు. చెంచు కాలనీలో తాగునీటి సమస్య ఉందని సర్పంచ్, సెక్రటరీ, ఎంపీడీవోకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్​ భగీరథ నీళ్లు వస్తున్నా నాలుగైదు బిందెలు మాత్రమే వస్తున్నాయని వాపోయారు. ఆందోళనకారులకు కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు మద్దతు తెలిపారు.