బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే వివేక్ పరామర్శ

బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే వివేక్ పరామర్శ

చెన్నూరు, వెలుగు :  చెన్నూరు పట్టణానికి చెందిన కాంగ్రెస్​ కార్యకర్త సుద్దపల్లి సుశీల్​ కుమార్​కుటుంబాన్ని  చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్​ వివేక్​ వెంకటస్వామి పరామర్శించారు. మంగళవారం సాయంత్రం సుశీల్​ కుమార్​తల్లి వెంకటమ్మ అనారోగ్యంతో మృతిచెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే హుటాహుటిన చెన్నూరు చేరుకున్నారు.

వెంకటమ్మ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించి ఆ కుటుంబాన్ని ఓదార్చారు. ఆయన వెంట కాంగ్రెస్​ లీడర్లు గొడిసెల బాపిరెడ్డి, ఫయాజ్, సూర్యనారాయణ, గజ్జెల అంకాగౌడ్, చింతల శ్రీనివాస్, పాతర్ల నాగరాజ్, తనుగుల రవి, ముత్యాల బాపగౌడ్, లచ్చన్న, జడల సతీష్ తదితరులు ఉన్నారు.