ఓటర్లకు ఆ హక్కు ఉంది..ఎన్నికల హామీల అమలుపై సీఈసీ

ఓటర్లకు ఆ హక్కు ఉంది..ఎన్నికల హామీల అమలుపై సీఈసీ

చెన్నై: రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సాధ్యాసాధ్యాలను తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ తెలిపారు. శనివారం ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. రాజకీయ పార్టీలకు తమ ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు ఇచ్చే హక్కు ఉందని ఆయన చెప్పారు. అదే విధంగా హామీల అమలు సాధ్యామేనా, నిధులు ఎక్కడి నుంచి సమకూరుస్తారని తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉందని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని వెల్లడించారు. రాజకీయ పార్టీలు తమ ఎన్నికల వాగ్ధానాలను వెల్లడించేందుకు ప్రొఫార్మా సిద్ధం చేసినట్లు తెలిపారు. దర్యాప్తు సంస్థలు అప్రమత్తంగా ఉండాలని.. నగదు, ఉచిత వస్తువుల పంపిణీని నిరోధించాలని ఆదేశించారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ పీసీఐ) ఆన్ లైన్ లావాదేవీలను మానిటర్ చేయాలని కోరారు.