విశాఖపట్నం పర్యటనలో ట్రాఫిక్ జామ్ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం రాక సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో గంటల తరబడి రోడ్డుపై వాహనాలను నిలిపివేశారు. దీంతో విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు, సాదారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనిపై సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ విమానాశ్రయం దగ్గర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించడంపై సీఎం జగన్ ఫైరయ్యారు. గంటల తరబడి ట్రాఫిక్ ని ఎందుకు ఆపారని.. ప్రయాణికులకు ఎందుకు ఇబ్బందులు కలుగజేశారని మండిపడ్డారు. ప్రజలకు అసౌకర్యం కలిగించినందుకు చింతిస్తున్నానని.. దీనిపై విచారణ జరపాలని డీజీపీని జగన్ ఆదేశించారు. నిన్న ఎయిర్ పోర్ట్ దగ్గర ప్రయాణికులను నిలిపివేయడంతో తమ లగేజీతో పరిగెత్తుకుంటూ.. విమానాశ్రయానికి చేరుకోవాల్సి వచ్చింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కారాదని ఆయన స్పష్టం చేశారు.
♦విశాఖలో నిన్న తన పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలపై సీఎం జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) February 10, 2022
♦గంటల తరబడి ట్రాఫిక్ను ఎందుకు నిలిపేశారని.. ప్రజలను ఎందుకు ఇబ్బందులకు గురి చేశారని అధికారులపై సీరియస్ అయ్యారు.
♦ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలన్నారు. pic.twitter.com/cuKp68QXk9
మరిన్ని వార్తల కోసం