- ఎల్ఏసీకి దగ్గర్లో ఇప్పటికే 250 ఇండ్లతో ఊర్లు
- పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న ఇండియన్ ఆర్మీ
న్యూఢిల్లీ: చైనా పన్నిన మరో పన్నాగం బయటపడింది. మనదేశ బార్డర్కు ఆనుకుని ఏకంగా 400 గ్రామాలను నిర్మించేందుకు ప్లాన్ చేసినట్లు తేలింది. ఉత్తరాఖండ్లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసీ)కి 11 కి.మీ. దూరంలో 250 ఇండ్లతో కూడిన బార్డర్ సెక్యూరిటీ విలేజ్ను చైనా ఇదివరకే నిర్మించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఎల్ఏసీకి 35 కిలోమీటర్ల దూరంలో ఇంకో 56 ఇండ్లను నిర్మిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అలా ఉత్తరాఖండ్తో 350 కిలోమీటర్ల మేర ఉన్న బార్డర్ వెంబడి చైనా 400 ఇండ్లను నిర్మించాలని స్కెచ్ వేసిందని చెప్పాయి. ఇదంతా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) పర్యవేక్షణలోనే జరుగుతోందని ప్రకటించాయి.
కొత్తగా నిర్మిస్తున్న గ్రామాల్లో అన్ని రకాల సౌలత్లతోపాటు పెద్ద పెద్ద మార్కెట్లు ఉన్నాయని వెల్లడించాయి. ఎల్ఏసీ వెంబడి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు ఇండియన్ ఆర్మీ ఇదివరకే స్పష్టం చేసింది.