ఏడాది తర్వాత మళ్లీ చైనాలో కరోనా డెత్స్

ఏడాది తర్వాత మళ్లీ చైనాలో కరోనా డెత్స్

చైనాలో కరోనా మళ్లీ పంజా విసురుతోంది. గత రెండేండ్లల్లో ఎన్నడూ లేని విధంగా అక్కడ వైరస్ విజృంభిస్తోంది. రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా స్టెల్త్ ఒమిక్రాన్ కేసులు డ్రాగన్ కంట్రీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధిస్తోంది. ఇప్పటికే 13 ప్రధాన నగరాల్లో పూర్తిగా లాక్ డౌన్  విధించింది. మరికొన్ని నగరాల్లో పాక్షిక లాక్ డౌన్ లు విధించింది. విదేశీ ప్రయాణాలపై కూడా ఆంక్షలు విధించింది.

2021 జనవరి తర్వాత ఇప్పుడే..

చైనాలోని పలు సిటీల్లో రోజూ రెండు మూడు వేల చొప్పున కరోనా కేసులు నమోదవుతున్నాయని ఆ దేశ జాతీయ ఆరోగ్య అధికారులు చెబుతున్నారు. చైనాలో ఏడాది తర్వాత తొలిసారి రెండు కరోనా మరణాలు నమోదైనట్లు నివేదించారు. 2021 జనవరి తర్వాత మళ్లీ చైనాలో కరోనా మరణాలు సంభవించడం ఇదేనని చెప్పారు. 


దక్షిణ కొరియాలో రోజు లక్షల్లో కేసులు

ఒమిక్రాన్  వేరియంట్  సరికొత్త రూపాయన్ని సంతరించుకుంటూ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. దక్షిణ కొరియాలో రోజు లక్షల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గురువారం నాడు 6 లక్షలకు పైగా కొత్త కేసులు రాగా.. శుక్రవారం 3,81,454 మంది వైరస్ బారినపడ్డారని కొరియన్ డిసీజ్ కంట్రోల్ ప్రవెన్షన్ ఏజెన్సీ తెలిపింది.