మరోసారి చైనా బరితెగింపు

మరోసారి చైనా బరితెగింపు
  • అరుణాచల్​ తమదేనని కామెంట్స్
  • అది ఇండియాదేనని అమెరికా వెల్లడి

బీజింగ్​ : అరుణాచల్​ప్రదేశ్ లోని 11 ప్రాంతాలకు ఇటీవల కొత్త పేర్లు పెట్టిన చైనా.. ఇప్పుడు మరింత బరి తెగించింది. ఆ రాష్ట్రం భారత్​కు చెందిందేనని తెలిసినా.. దానిపై తమకు సార్వభౌమాధికారం ఉందని మరోసారి ప్రకటించుకుంది. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్​ మంగళవారం ఒక  ప్రెస్ ​కాన్ఫరెన్స్​లో మాట్లాడుతూ.. ‘‘జాంగ్నన్​(అరుణాచల్​ప్రదేశ్) అనేది చైనాలో అంతర్భాగం”అంటూ వివాదాస్పద కామెంట్​చేశారు.‘‘జాంగ్నన్​ (అరుణాచల్)లోని కొన్ని ప్రాంతాలకు చైనా ప్రభుత్వంలోని సంబంధిత విభాగాలు ఇటీవల కొత్త పేర్లు పెట్టాయి. అరుణాచల్​ అనేది చైనా సార్వభౌమత్వ హక్కు పరిధిలోనే ఉంది”అని ఆమె పేర్కొన్నారు.

మరోవైపు ఈ పరిణామాలపై అమెరికా స్పందించింది. అరుణాచల్​ప్రదేశ్​ను భారత్​లో అంతర్భాగంగానే తాము గుర్తించామని స్పష్టం చేసింది. చైనా ఏకపక్షంగా అరుణాచల్​లోని ప్రాంతాలకు కొత్త పేర్లు పెడుతూ, అవి తమవేనని ప్రకటించుకోవడాన్ని వైట్​ హౌస్​  ప్రెస్​సెక్రటరీ కెరీన్​ జీన్​ పియెరీ తీవ్రంగా ఖండించారు. ఈవిషయంలో భారత్​కు మద్దతుగా ఉంటామన్నారు.