
వాషింగ్టన్: అమెరికాకు నులిపురుగులకు సంబంధించిన జీవపదార్థం, బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులకు చెందిన డీఎన్ఏను స్మగ్లింగ్ చేసిన చైనీస్ పీహెచ్డీ స్టూడెంట్ను ఎఫ్బీఐ అధికారులు అరెస్ట్ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన చైనాలోని వుహాన్ నుంచే ఈ బయాలజికల్ మెటీరియల్స్ను పంపినట్టు గుర్తించామని ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ వెల్లడించారు. ‘‘వుహాన్కు చెందిన చెంగ్జువాన్ హన్ డెట్రాయిట్లో పీహెచ్డీ చేస్తోంది.
ఆమె వుహాన్లోని హువాజాంగ్ వర్సిటీ నుంచి యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్లోని ల్యాబ్కు 2024 సెప్టెంబర్ నుంచి 2025 మార్చి మధ్యలో బయాలజికల్ మెటీరియల్స్ ఉన్న 4 ప్యాకెట్లను పంపింది. వీటి గురించి తప్పుడు సమాచారం ఇవ్వడంతో పాటు విచారణకు ముందు ఫోన్ డేటాను ఎరేజ్ చేసిందని తేలింది. దీంతో డెట్రాయిట్ ఎయిర్ పోర్టులో హన్ను అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు” అని కాష్ పటేల్ వివరించారు.