జనసేన పార్టీకి చిరంజీవి రూ.5 కోట్ల విరాళం

జనసేన పార్టీకి  చిరంజీవి రూ.5 కోట్ల విరాళం

మెగాస్టార్ చిరంజీవి జనసేన పార్టీకి ఐదు కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. ప్రస్తుతం ఆయన విశ్వంభర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. తాజాగా విశ్వంభర సెట్స్ కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాగబాబుతో కలిసి వచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ఆశీర్వాదాలు తీసుకున్నారు.

త్వరలో ఆంధ్రప్రదేశ్ లో జరుగనున్న ఎన్నికల్లో జనసేన విజయం సాధించాలని ఆశిస్తూ తమ ఇలవేల్పు ఆంజనేయ స్వామివారి పాదాల చెంత తమ్ముడు పవన్ కళ్యాణ్ కు రూ.5 కోట్ల చెక్ అందజేశారు చిరంజీవి. ప్రస్తుతం దీనికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.