100 విమానాల్లో అయోధ్యకు గెస్టులు

100 విమానాల్లో అయోధ్యకు గెస్టులు

న్యూఢిల్లీ: బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనేందుకు గెస్టులు 100 విమానాల్లో అయోధ్యకు చేరుకున్నారు. ఈ పవిత్రోత్సవానికి 7 వేలకుపైగా గెస్టులకు ఇన్విటేషన్లు పంపించిన విషయం తెలిసిందే. హేమ మాలిని, కంగనా రనౌత్, సీనియర్ రవిశంకర్, మొరారీ బాపు, రజనీకాంత్, పవన్ కల్యాణ్, మధుర్ భండార్కర్, సుభాష్ ఘై, షెఫాలీ షా, సోనూ నిగమ్ తదితరులు ఆదివారమే అయోధ్య చేరుకున్నారు. 

సోమవారం ఉదయం ఆర్‌‌ఎస్‌‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, అనుపమ్ ఖేర్, కైలాష్ ఖేర్, జుబిన్ నౌటియల్, ప్రసన్ జోషి, మనోజ్ జోషి, సచిన్ టెండూల్కర్, అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, రవిశంకర్ ప్రసాద్, అనిల్ అంబానీ ఈ కార్యక్రమానికి వచ్చారు. ఆదివారమే చాలామంది ప్రముఖులు అయోధ్యకు చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే గెస్టుల కోసం దాదాపు వంద విమానాలు రాకపోలు సాగిస్తాయని విమానాశ్రయ అధికారులు అంచనా వేయగా.. ఆదివారం నాటికే 90 విమానాలు రాకపోకలు సాగించాయి.