
- సీఐటీయూ ప్రెసిడెంట్ టి.రాజారెడ్డి
గోదావరిఖని, వెలుగు : సింగరేణిలో సొంతింటి కళను నిజం చేయాలని సీఐటీయూ అనుబంధ సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ టి.రాజారెడ్డి డిమాండ్చేశారు. శనివారం గోదావరిఖని ప్రెస్ క్లబ్లో జరిగిన మీటింగ్లో ఆయన మాట్లాడారు. సింగరేణి వ్యాప్తంగా ఈ నెల 11, 12 తేదీల్లో సొంతిళ్లు కావాలా..? కంపెనీ క్వార్టర్ కావాలా.. ? అనే అంశంపై సీఐటీయూ ఆధ్వర్యంలో బొగ్గు గనుల వద్ద బ్యాలెట్నిర్వహించామన్నారు. ఇందులో మొత్తం 22,068 మంది పాల్గొనగా, 21,836 మంది కార్మికులు సొంతిళ్లు కావాలని ఓటు వేశారని తెలిపారు.
ఈ నేపథ్యంలో కార్మికులు రిటైర్డ్ అయ్యే నాటికి సొంతింటిలో నివాసం ఉండేలా సింగరేణి మేనేజ్మెంట్చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో మిగతా కార్మిక సంఘాలు స్పందించాలని, లేనిపక్షంలో కార్మికులను ఓటు అడుగొద్దని చెప్పారు. సమావేశంలో యూనియన్ ఆర్జీ 1 ఏరియా ప్రెసిడెంట్రాజమౌళి, సెక్రటరీ శ్రీనివాస్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.