ప్రభుత్వం జీపీ కార్మికులను నమ్మించి మోసం చేసింది : అన్నదాస్ గణేశ్

ప్రభుత్వం జీపీ కార్మికులను నమ్మించి మోసం చేసింది : అన్నదాస్ గణేశ్

సిరిసిల్ల, టౌన్ వెలుగు : గతంలో 34 రోజుల జీపీ కార్మికుల సమ్మె లో భాగంగా రాష్ట్ర జేఏసీని చర్చలకు పిలిచి,  ప్రభుత్వం ఇచ్చిన హామీలు  నెరవేర్చకుండా..  కార్మికులను మోసం  చేసిందని  సీఐటీయూ జనరల్ సెక్రటరీ అన్నదాస్ గణేశ్​ అన్నారు.  బుధవారం రాజన్న సిరిసిల్ల  కలెక్టరేట్ ఎదుట  సీఐటీయూ ఆధ్వర్యంలో జీపీ కార్మికులు ధర్నా చేశారు.    ఈ సందర్భంగా వారు మాట్లాడారు.  

6 నెలలుగా వేతనలు   చెల్లించకుండా..  కేటీఆర్​ తమ  ప్రభుత్వం గురించి గొప్పలు చెబుతున్నారని విమర్శించారు.  కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మల్యాల నర్సయ్య,  యూనియన్​ జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి,  జిల్లా కార్యదర్శి మొర అజయ్,  మండల అధ్యక్షులు బూర శ్రీనివాస్ , లింగంపెల్లి కృష్ణవేణి   
పాల్గొన్నారు.