V6 News

వడ్ల కొనుగోళ్లు స్పీడప్ చేయాలి : సివిల్ సప్లై కమి షనర్ స్టీఫెన్ రవీంద్ర

వడ్ల కొనుగోళ్లు స్పీడప్ చేయాలి : సివిల్ సప్లై కమి షనర్ స్టీఫెన్ రవీంద్ర
  •     సివిల్​ సప్లై కమిషనర్​ స్టీఫెన్​ రవీంద్ర

కామారెడ్డి, వెలుగు: వడ్ల కొనుగోళ్లు స్పీడప్​ చేయాలని సివిల్​ సప్లై కమిషనర్​ స్టీఫెన్​ రవీంద్ర ఆదేశించారు. మంగళవారం కామారెడ్డి జిల్లాలో ఆయన పర్యటించారు.   కామారెడ్డి మండలం గర్గుల్, రామారెడ్డి మండలం గోకుల్​తండాలో వడ్ల కొనుగోలు సెంటర్లను పరిశీలించారు. రైతులు, అధికారులతో మాట్లాడారు. సెంటర్లలో సౌలతులు కల్పించాలని సూచించారు. 

కాంటా అయిన తర్వాత రైతులకు వడ్ల డబ్బులు చెల్లించేందుకు, ఆన్​లైన్​లో ఎంట్రీ చేయాలన్నారు.  కాంటా, ఆన్​లైన్​ ఎంట్రీలో జాప్యం జరగకుండా చూసుకోవాలని సూచించారు. జిల్లాలో కొనుగోళ్ల వివరాలను అధికారులతో చర్చించారు. కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 35,300 మెట్రిక్​ టన్నుల వడ్లను కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. ఆయన వెంట అడిషనల్  కలెక్టర్​ వి.విక్టర్, డీఎస్​వో వెంకటేశ్వర్లు, డీఎం శ్రీకాంత్​ ఉన్నారు.