
వేములవాడ, వెలుగు: వేములవాడ రాజన్న ఆలయంలో దర్శనాల బంద్పై వివిధ ప్రచారాలు నడుస్తున్నాయని, వీటిపై భక్తులకు అధికారులు స్పష్టత ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర నేత ప్రతాప రామకృష్ణ అన్నారు. వేములవాడ పట్టణంలోని భీమేశ్వర గార్డెన్స్లో సోమవారం మీడియాతో మాట్లాడుతూ రాజన్న ఆలయం అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదన్నారు. రాజన్న ఆలయంలో దసరా తర్వాత భక్తులకు దర్శనాలను నిలిపివేస్తారని ప్రచారం జరుగుతుందని, దానిపై అధికారులు స్పష్టత ఇవ్వాలన్నారు. సమావేశంలో నాయకులు రేగుల మల్లికార్జున్, పట్టణ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్, కృష్ణస్వామి, గుంటి కనుకయ్య, తదితరులు పాల్గొన్నారు.