తిరుమలలో నూతన వసతి సముదాయాన్ని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి, సీఎం చంద్రబాబు

తిరుమలలో నూతన వసతి సముదాయాన్ని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి, సీఎం చంద్రబాబు

తిరుమలలో నూతన పీఏసీ-5 వసతి సముదాయాన్ని ప్రారంభించారు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ, సీఎం చంద్రబాబు. గురువారం ( సెప్టెంబర్ 25 ) తిరుమల చేరుకున్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ సీఎం చంద్రబాబుతో కలిసి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు 105 కోట్ల రూపాయల వ్యయంతో ఈ వసతి సముదాయాన్ని నిర్మించింది టీటీడీ. ఈ వసతి సముదాయంల 2 వేల 500 లాకర్లు, పది లిఫ్టులతో ఆధునిక సౌకర్యాలతో నిర్మించారు.

ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో సహా మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు. రూ. 24 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఏఐ అనుసంధాన కమాండ్ కంట్రోల్ సెంటర్, అలాగే రూ. 3 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన లడ్డు ప్రసాదాల ముడిసరుకుల నాణ్యత యంత్రాలను వర్చువల్ గా ప్రారంభించారు.

ఇదిలా ఉండగా.. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం ( సెప్టెంబర్ 24 ) ప్రారంభమైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఇవాళ ( సెప్టెంబర్ 25 ) రెండో రోజుకు చేరుకున్నాయి. ఇవాళ ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనంపై దర్శనమిచ్చారు స్వామివారు. మధ్యాహ్నం 1 నుంచి  3 గంటల వరకు స్నపనం.. రాత్రి 7 గంటలకు హంస వాహన సేవ నిర్వహించనున్నారు.

వాహన సేవల వివరాలు:

  • సెప్టెంబర్​23 :  సాయంత్రం శ్రీవారి సాలకట్ల  బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
  • సెప్టెంబర్​24 :   సాయంత్రం 05:43 నుంచి  6.15 వరకు  మీన లగ్నంలో ధ్వజారోహణం...  రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనం.
  • సెప్టెంబర్ ​25 :  ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం.. మధ్యాహ్నం 1 నుంచి  3 గంటల వరకు స్నపనం.. రాత్రి 7 గంటలకు హంస వాహనం
  • సెప్టెంబర్ ​26 :  ఉదయం 8 గంటలకు సింహ వాహనం... మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనం
  • సెప్టెంబర్​27 :  ఉదయం 8 గంటలకు కల్పవృక్షం వాహనం..మధ్యాహ్నం 1 గంటకు స్నపనం.. రాత్రి 7 గంటలకు సర్వ భూపాల వాహనం
  • సెప్టెంబర్​28 :  ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం... సాయంత్రం 6:30 నుంచి రాత్రి  గరుడ వాహనం
  • సెప్టెంబర్​29  : ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం....  సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథం... రాత్రి 7 గంటలకు గజ వాహనం
  • సెప్టెంబర్​30  :ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం... రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం
  • అక్టోబర్​ 1 :ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వ వాహనం
  • అక్టోబర్​ 2:   ఉదయం 6 నుండి 9 వరకు చక్రస్నానం...  రాత్రి 8:30 నుంచి  10 గంటల వరకు ధ్వజావరోహణం.