సెప్టెంబర్ 4న పాలకుర్తికి సీఎం కేసీఆర్

సెప్టెంబర్ 4న పాలకుర్తికి సీఎం కేసీఆర్

సెప్టెంబర్ 4న జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. అక్కడ వల్మిడి రామాలయ ప్రతిష్టాపన, పాలకుర్తి సోమనాథుని మ్యూజియంను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ తో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. 

ALSO READ : విజయ్ 68 మూవీలో హీరోయిన్గా.. OG బ్యూటీ ప్రియాంక మోహన్!

ఇందులో భాగంగా వల్మిడి ఆలయ అభివృద్ధి పనులు, పాలకుర్తి టూరిజం పనులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. మరో భద్రాద్రిని తలపిస్తున్న వల్మిడి రామాలయ కట్టడాలు.. పాలకుర్తిలో 11 అడుగుల భారీ సోమనాథుని రాతి విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. పెండింగ్ పనులన్నీ తర్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.