డిసెంబర్ 24న కోస్గికి సీఎం రేవంత్ రెడ్డి ..కొత్త సర్పంచులకు సన్మానం

డిసెంబర్ 24న  కోస్గికి సీఎం రేవంత్ రెడ్డి ..కొత్త సర్పంచులకు సన్మానం
  •     కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన ఆఫీసర్లు

కోస్గి, వెలుగు: సీఎం రేవంత్​రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్​లో బుధవారం పర్యటించనున్నారు. ఇటీవల జరిగిన సర్పంచ్​ ఎన్నికల్లో నియోజకవర్గంలో కాంగ్రెస్​ మద్దతుతో పోటీ చేసిన క్యాండిడేట్లు ఎక్కువ మంది విజయం సాధించారు. దీంతో వారిని సన్మానించాలని నిర్ణయించారు. 

నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలోని ఓ ప్రైవేట్  ఫంక్షన్​ హాల్​లో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా, జిల్లా అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. సర్పంచులను సన్మానించడంతో పాటు వారితో కలిసి సీఎం భోజనం చేయనున్నారు. హైదరాబాద్​ నుంచి హెలికాప్టర్​లో మధ్యాహ్నం ఆయన కోస్గికి చేరుకొని, కార్యక్రమం అనంతరం హైదరాబాద్ తిరిగి వెళ్తారని అధికారులు తెలిపారు.

 కొడంగల్​ నియోజకవర్గంలోని కోస్గి, మద్దూర్, దౌల్తాబాద్, కొడంగల్, బొంరాస్​పేట్, గుండుమాల్, కొత్తపల్లి మండలాలకు చెందిన 180 మంది సర్పంచులు, 180 మంది ఉప సర్పంచులు, 1,739 మంది వార్డు సభ్యులను సీఎం సన్మానించనున్నారు. సీఎం టూర్​కు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లు నారాయణపేట ఎస్పీ వినీత్​ తెలిపారు. మంగళవారం ఆయన కోస్గిలో పర్యటించి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు.