నిలిచిన బొగ్గు ఉత్పత్తి..ఎడతెరిపి లేని వానలతో ఎక్కడికక్కడ పనులు బంద్

నిలిచిన బొగ్గు ఉత్పత్తి..ఎడతెరిపి లేని వానలతో ఎక్కడికక్కడ పనులు బంద్

కోల్​బెల్ట్,వెలుగు: ఎడతెరిపి లేని వానలతో సింగరేణి ఓపెన్​ కాస్ట్​ బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిచింది. మంచిర్యాల, ఆసిఫాబాద్ ​జిల్లాలోని నాలుగు ఓపెన్​కాస్ట్​లు, శ్రీరాంపూర్​ ఏరియా,  మందమర్రి ఏరియా, బెల్లంపల్లి ఏరియాలోని  ఓసీపీల్లోని క్వారీల్లో పనులు బంద్ పెట్టారు.  దీంతో దాదాపుగా 50 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. క్వారీల్లో నీటిని మోటార్ల ద్వారా తోడుతున్నారు. డంపర్లు, డోజర్లు, షావల్ ​మెషీన్లను యార్డుపైనే నిలిపివేశారు.

 ఓవర్​బర్డెన్​(మట్టి)వెలికితీత పనులు కూడా నిలిచాయి. మరోవైపు ఉద్యోగులు డ్యూటీలకు వచ్చినా పనులు లేకపోవడంతో ఖాళీగా ఉండిపోయారు. బెల్లంపల్లి రీజియన్​ పరిధిలోని11 అండర్​ గ్రౌండ్​ బొగ్గు గనుల్లోనూ ఉద్యోగులు పూర్తిస్థాయిలో హాజరుకాలేదు.  వర్షాలు తగ్గిన తర్వాతనే క్వారీల్లోకి రాకపోకలకు చాన్స్ ఉంది. అప్పటి వరకు స్టాక్​ కోల్​ను రవాణా చేస్తున్నారు.