నిర్మల్ ఉత్సవాలను సక్సెస్ చేయాలి : కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్ ఉత్సవాలను సక్సెస్ చేయాలి : కలెక్టర్ అభిలాష అభినవ్
  •     కలెక్టర్ అభిలాష అభినవ్ 

నిర్మల్, వెలుగు :  అధికారులందరూ సమన్వయంతో పనిచేసి నిర్మల్ ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్ లో నిర్మల్ ఉత్సవాల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు సైతం పెద్ద ఎత్తున నిర్మల్ ఉత్సవాల్లో పాల్గొనే విధంగా విస్తృత ప్రచారం చేయాలని తెలిపారు. 

నిర్మల్ జిల్లా చరిత్ర తెలియజేసేలా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. ఈనెల19 నుంచి 23 వరకు నిర్వహించబోయే నిర్మల్ ఉత్సవాలకు ప్రొటోకాల్ పాటిస్తూ, ప్రజాప్రతినిధులు, ప్రముఖులను ఆహ్వానించాలని సూచించారు. సంతకాల బోర్డు, సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయాలన్నారు. పార్కింగ్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. 

పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ కిశోర్ కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, డీఈవో భోజన్న, డీవైఎస్ వో శ్రీకాంత్ రెడ్డి, సీపీవో జీవరత్నం, డీపీవో శ్రీనివాస్, డీఆర్డీవో విజయలక్ష్మి, డీఎంహెచ్ వో రాజేందర్, అగ్నిమాపక అధికారి శివాజీ, ఉద్యానవన పంటల అధికారి రమణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.