విపత్తుల సమయంలో ఎన్డీఆర్ఎఫ్ వెంటనే స్పందించాలి : కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

విపత్తుల సమయంలో  ఎన్డీఆర్ఎఫ్ వెంటనే స్పందించాలి : కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

మహబూబాబాద్, వెలుగు: ప్రకృతి విపత్తుల సమయంలో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం చురకుగా పనిచేయాలని మహబూబాబాద్​ కలెక్టర్​ అద్వైత్​ కుమార్​ సింగ్ కోరారు. మంగళవారం కలెక్టరేట్​లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ​ప్రకృతి విపత్తులు, వరదలు, భూకంపాలు, తుపాన్  వంటి అత్యవసర పరిస్థితుల్లో అధికారులు సమన్వయంతో పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. 

జిల్లాలో 20 మందితో  ఏర్పాటు చేసిన ఎన్డీఆర్​ఎఫ్​ బృందంనేటి నుంచి ఆగస్టు 14  వరకు మున్సిపాలిటీలు, గ్రామాల్లో అవేర్ నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తారని  తెలిపారు. సమీక్షలో అడిషనల్​ కలెక్టర్లు కె.అనిల్​ కుమార్, లెనిన్​ వత్సల్​టొప్పో, మహబూబాబాద్ ఆర్డీవో కృష్ణవేణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్​ పట్టణంలోని కేజీబీవీ, మండల పరిషత్​హైస్కూల్​ను డీఈవో రవీందర్​రెడ్డితో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించి, టీచర్లకు పలు సూచనలు చేశారు.