వడ్ల కొనుగోళ్లలో నిర్లక్ష్యం చేయొద్దు : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

వడ్ల కొనుగోళ్లలో నిర్లక్ష్యం చేయొద్దు : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
  • కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​

కామారెడ్డిటౌన్​, వెలుగు : వడ్ల కొనుగోళ్లలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్ హెచ్చరించారు.  సోమవారం విధుల్లో చేరిన కలెక్టర్​ మంత్రులు ఉత్తమ్​కుమార్​రెడ్డి, తుమ్మల నాగేశ్వర్​రావు, సీఎస్​ రామకృష్ణ నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్​లో పాల్గొన్నారు. అనంతరం అధికారులతో మీటింగ్​నిర్వహించి మాట్లాడారు. నిబంధనల ప్రకారం సెంటర్లలో కొనుగోళ్లు చేపట్టాలన్నారు. 

ఇబ్బందులు వస్తే తెలిపేందుకు కంట్రోల్ రూమ్​ కూడా  ఏర్పాటు చేశామన్నారు.  ఇందిరమ్మ ఇండ్లు గడువులోగా కంప్లీట్ అయ్యేలా చూడాలన్నారు.  అడిషనల్​ కలెక్టర్లు  విక్టర్, మదన్​మోహన్,  ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ,  ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. 

హైవే నిర్మాణానికి భూ సేకరణ చేపట్టాలి 

 హైవే ప్రాజెక్ట్​కు సంబంధించి భూ సేకరణ చేపట్టాలని కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు.  సోమవారం కలెక్టరేట్​లో హైవే భూ సేకరణ, పనుల పురోగతిపై అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఎన్​హెచ్ 765 డికి సంబంధించి మెదక్​ నుంచి ఎల్లారెడ్డి వరకు భూ సేకరణ జరిగిందని, రైతులకు పరిహారం  అందేలా చూడాలన్నారు.  ఎల్లారెడ్డి నుంచి రుద్రూర్​ వరకు  భూ సేకరణ త్వరగా కంప్లీట్ చేసి పరిహారం త్వరగా అందేలా చూడాలన్నారు.

  సబ్​ కలెక్టర్​ కిరణ్మయి,  ఆర్డీవో పార్థసారధిరెడ్డి,  డీఈలు ప్రవీన్​కుమార్​, నరేశ్​కుమార్, ఏఈలు వినోద్, మనోహర్పాల్గొన్నారు.  ఈవీఎం గోడౌన్​ తనిఖీ జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్​ను సోమవారం కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్ తనిఖీ చేశారు.  గోడౌన్​తో పాటు, సీసీ కెమెరాలను పరిశీలించారు. అడిషనల్​ కలెక్టర్​ విక్టర్​, ఆర్డీవో వీణ, అధికారులు ఉన్నారు.