
యాదాద్రి, వెలుగు : టీచర్లు చదువు మంచిగా చెబుతున్నారా..? అంటూ స్టూడెంట్స్ను కలెక్టర్ హనుమంతరావు ఆరా తీశారు. శుక్రవారం బీబీనగర్ మండలం కొండమడుగు జడ్పీ హైస్కూల్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్తో మాట్లాడారు. టీచర్లు సరిగా స్కూల్కు వస్తున్నారా.? పాఠాలు మంచిగా చెబుతున్నారా..? అంటూ అడిగారు.
మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి స్టూడెంట్స్కు స్వయంగా వడ్డించారు. అనంతరం పల్లె దవాఖానను ఆయన సందర్శించి పేషెంట్లతో మాట్లాడారు. డాక్టర్లు ట్రీట్మెంట్ఎలా చేస్తున్నారని ఆరా తీశారు. మరోవైపు భువనగిరిలోని డంపింగ్ యార్డును అడిషనల్ కలెక్టర్ భాస్కర్రావు పరిశీలించారు.