
కొత్తపల్లి/చొప్పదండి, వెలుగు: భవిష్యత్ భారతానికి ప్రాథమిక విద్యే పునాది అని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కొత్తపల్లి మండలం పద్మనగర్ పారమిత హెరిటేజ్ స్కూల్లో గంగాధర మండల ప్రైమరీ స్కూల్ టీచర్లకు నైపుణ్య శిక్షణను శుక్రవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టీచర్లు శిక్షణలో నేర్చుకున్న అంశాలను స్కూళ్లలో అమలుచేయాలని, అప్పుడే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందన్నారు.
అనంతరం ప్రాథమిక స్థాయి శిక్షణ మాడ్యూల్ను ఆవిష్కరించారు. అంతకుముందు చొప్పదండి హెల్త్ సెంటర్ను సందర్శించారు. హాస్పిటల్లోని ఓపీ విభాగం, ల్యాబ్, లేబర్ రూమ్, ఫార్మసీలో మందుల నిల్వలను పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా క్వాలిటీ కో ఆర్డినేటర్ కర్ర అశోక్రెడ్డి, ఎంఈవో ప్రభాకర్రావు, డిప్యూటీ డీఎంహెచ్వో సాజిదా, మెడికల్ ఆఫీసర్ శ్రీకీర్తన, సిబ్బంది పాల్గొన్నారు.
వ్యాపారులు రూల్స్ పాటించాలి
కరీంనగర్ టౌన్, వెలుగు: ఫర్టిలైజర్ వ్యాపారులు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ పమేలా సత్పతి హెచ్చరించారు. శుక్రవారం కరీంనగర్ గాంధీ రోడ్డులోని ఎరువుల దుకాణాలు, గోదాంలను తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి విత్తనాల నిల్వ, అమ్మకాలకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు ఎరువులు కొనేందుకు ఆధార్ వెంట తెచ్చుకోవాలని, తప్పనిసరిగా రసీదును భద్రపరుచుకోవాలని సూచించారు. అంతకుముందు కలెక్టరేట్లో మెడికల్ ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ప్రైవేట్ హాస్పిటళ్లకు దీటుగా ప్రభుత్వ హాస్పిటళ్లలో అత్యుత్తమైన వైద్య సేవలు
అందించాలని సూచించారు.