
మెదక్టౌన్, వెలుగు: సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) పై అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు. ఈ నెల 29న రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్, రాష్ట్ర సమాచార కమిషనర్లు మెదక్ జిల్లాలో పర్యటించనున్నట్లు తెలిపారు. గురువారం మెదక్కలెక్టరేట్లో రీసోర్స్పర్సన్యూసుఫ్అలీ ఆధ్వర్యంలో అధికారులకు ఒక్కరోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రభుత్వ ఆఫీసులో ఒక పీఐవో ఉంటారని, ప్రజల సమాచార అభ్యర్థనలను స్వీకరించి సమాధానం అందజేస్తారని పేర్కొన్నారు.
సమాచార హక్కు చట్టంపై అధికారులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్నగేశ్, డీఆర్వో భుజంగరావు, ఏఎస్పీ మహేందర్, సమాచార హక్కు చట్టం రిసోర్స్ పర్సన్ యూసుఫ్ అలీ, ఆర్డీవోలు రమాదేవి, మహిపాల్ రెడ్డి, జయచంద్రారెడ్డి, పౌర సమాచార అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలు పక్కాగా అమలు చేయాలి
వెల్దుర్తి: ప్రభుత్వ సంక్షేమ పథకాలను అధికారులు పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ రాహుల్రాజ్సూచించారు. వెల్దుర్తి మండలంలో పర్యటించి పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు, అనంతరం ఇందిరమ్మ ఇండ్ల పురోగతిని పరిశీలిస్తూ వేగంగా ఇండ్లు నిర్మించుకోవాలని దశల వారీగా బిల్లు లబ్ధిదారుడి అకౌంట్లో జమవుతుందన్నారు. అనంతరం బీసీ సంక్షేమ వసతి గృహాన్ని పరిశీలిస్తూ విద్యార్థులకు నాణ్యమైన మెనూ అందించాలని సిబ్బందిని ఆదేశించారు.