
- కలెక్టర్ రాజర్షి షా ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: విద్యార్థుల భవిష్యత్ను తీర్చిదిద్దడంతో టీచర్ల పాత్ర కీలకమని ఆదిలాబాద్కలెక్టర్ రాజర్షి షా అన్నారు. సెప్టెంబర్5న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవంలో భాగంగా నిర్వహించే గురుపూజోత్సవ కార్యక్రమాన్ని ఒక రోజు ముందుగానే గురువారం పట్టణంలోని జడ్పీ మీటింగ్హాల్లో నిర్వహించారు. కలెక్టర్తో పాటు ఎమ్మెల్యే పాయల్శంకర్, ఐటీడీఏ పీవో, ఇంచార్జ్ డీఈవో ఖుష్బూ గుప్తా, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ట్రైనీ కలెక్టర్ సలోనీ హాజరయ్యారు.
ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ ఫొటోకు పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జిల్లాలోని ఉత్తమ టీచర్లకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేసి సన్మానించారు. కలెక్టర్మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్ను తీర్చిదిద్ది దేశాభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ముఖ్యమని అన్నారు. కార్యక్రమంలో హెచ్ఎంలు, టీచర్లు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.