
- కలెక్టర్ రాజర్షి
ఆదిలాబాద్టౌన్, వెలుగు: ఎన్నికల సంఘం నియమ నిబంధనలను అధికారులు తప్పక పాటించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల ఫ్లయింగ్స్వ్కాడ్లు, స్టాటిక్ సర్వేలెన్స్ టీంలకు ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి శనివారం కలెక్టరేట్లో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు, నగదు, మద్యం, బహుమతుల పంపిణీ వంటి అక్రమ చర్యలను పకడ్బందీగా పర్యవేక్షించాలని ఆదేశిం చారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, జడ్పీ సీఈవో రాజేశ్వర్, ఆర్డీవో స్రవంతి తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ సిబ్బంది సృజనాత్మకత అభినందనీయం
-పనికిరాని వ్యర్థాలను అద్భుతాలుగా మార్చిన మున్సిపల్సిబ్బంది సృజనాత్మకత అభినందనీయమని కలెక్టర్ కొనియాడారు. శనివారం స్థానిక గాంధీ పార్క్లో ‘వేస్ట్ టు వండర్’ ప్రదర్శనను కలెక్టర్ ప్రారంభించారు. ట్రైనీ కలెక్టర్సలోని పర్యవేక్షణలో వాడిన నీటి బాటిళ్లు, కూల్డ్రింక్ బాటిళ్లు, పాడైపోయిన వాహన చక్రాలు తదితర వ్యర్థాలను వినూత్న శిల్పాలుగా, ఆకర్షణీయ నమూనాలుగా తయారు చేసి పార్క్లో ఏర్పాటు చేయగా మున్సిపల్ సిబ్బందిని అభినిందించారు. పర్యావరణ పరిరక్షణకు దోహదపడే ఇలాంటి ప్రదర్శనలు ప్రతి పట్టణంలో ఏర్పాటు కావాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.