కేజీబీవీలో కల్చరల్ ప్రోగ్రాంలు నిర్వహించాలి : కలెక్టర్ సిక్తా పట్నాయక్

కేజీబీవీలో కల్చరల్ ప్రోగ్రాంలు నిర్వహించాలి : కలెక్టర్ సిక్తా పట్నాయక్

మరికల్, వెలుగు: కేజీబీవీల్లో  బాలికలకు చదువుతో పాటు కరాటే, కల్చరల్​ ప్రోగ్రాంలను తప్పకుండా నిర్వహించాలని నారాయణపేట కలెక్టర్​ సిక్తా పట్నాయక్​ ఎస్​వోకు సూచించారు.  మంగళవారం మండలంలోని పస్పుల వద్ద ఉన్న కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్​ ఆకస్మికంగా సందర్శించారు.  స్టూడెంట్లకు  సరిపడ మరుగుదొడ్లు, స్నానపు గదులు ఉన్నాయా లేదా అని ఎస్​వోను అడిగి తెలుసుకున్నారు. మెనూ బోర్డులో సూచించిన ప్రకారం క్రమం తప్పకుండా భోజనం అందించాలన్నారు.

  కల్చరల్​ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారా లేదా అని ఎస్​వోను ప్రశ్నించగా సాయంత్రం సమయాల్లో చేస్తున్నట్లు సమాధానం ఇచ్చారు. డీఈవో గోవిందరాజులు, ఏఎంవో విద్యసాగర్​, ఎమ్మార్వో రాంకోటి, ఎంపీడీవో కొండన్న, ఎంపీవో పావనితో పాటు ఎస్​వో రాజలక్ష్మిలు ఉన్నారు.