అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం : కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి

అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం : కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి

ఎడపల్లి, వెలుగు : అకాల వర్షాలకు తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని  కలెక్టర్​ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. గురువారం మండలంలోని జానకంపేట్​ గ్రామ శివారులో తడిసిన వరి ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు.  కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు  తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి బాయిల్డ్​ రైస్​ మిల్లలకు తరలించాలని ఆదేశించారు. ఇకపై కొనుగోలు చేసిన ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలనన్నారు. 

మండలంలో తడిసిన  ధాన్యం ఎంత ఉంటుందనే వివరాలు తెలుసుకుని నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించారు. కలెక్టర్​ వెంట ఎడపల్లి తహసీల్దార్ దత్తాద్రి, ఎడపల్లి సింగిల్​ విండో చైర్మన్ మల్కారెడ్డి, జానకంపేట్ సింగిల్ విండో చైర్మన్ నరేందర్, కార్యదర్శులు గంగారెడ్డి, రాజారాం,  తదితరులు ఉన్నారు. 

రెంజల్ ఏవోకు షోకాజ్ నోటీసు 

నవీపేట్, వెలుగు :  ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం, విధుల్లో అలసత్వం వహించినందుకు రెంజల్​మండల అగ్రికల్చర్​ ఆఫీసర్ సిద్ది రామేశ్వర్​కు  షోకాజ్ నోటీసు జారీ చేయాలని కలెక్టర్ వినయ్​కృష్ణారెడ్డి ఆదేశించారు. గురువారం మండలంలోని అభంగపట్నం, తడ్ గాం, రెంజల్ మండలం వీరన్నగుట్ట గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. వీరన్నగుట్ట కొనుగోలు కేంద్రం నుంచి కేటాయించిన రైస్​ మిల్లుకు కాకుండా వేరే మిల్లుకు పంపించడంపై కలెక్టర్​ సీరియస్​ అయ్యారు. 

ధాన్యం కాంటా వేయగానే ట్యాబ్​లో ఎంట్రీ చేయకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. తుఫాన్​ ప్రభావంతో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ధాన్యం తడవకుండా టార్ఫాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ వెంకటరమణ, ఐకేపీ ఏపీఎం మహేశ్​ తదితరులు ఉన్నారు.