చెప్పులపై జాతీయ జెండాను పోలిన రంగులు : అత్తాపూర్ లోని షోరూంలో కలకలం

చెప్పులపై జాతీయ జెండాను పోలిన రంగులు : అత్తాపూర్ లోని షోరూంలో కలకలం

హైదరాబాద్ రాజేంద్రనగర్ అత్తాపూర్ లోని ఓ షోరూంలో చెప్పులపై జాతీయ జెండాను పోలిన రంగులు ఉండడం కలకలం సృష్టించింది. చెప్పులు కొనేందుకు వచ్చిన ఓ కస్టమర్ ఇది గమనించి వ్యాపారికి చెప్పడంతో గొడవ మొదలైంది. విషయం తెలుసుకున్న స్థానిక బీజేపీ నాయకులు షాపులో చెప్పులను పరిశీలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో చెప్పులను సీజ్ చేసి, కేసు నమోదు చేశారు పోలీసులు.