వెలుగు బిజినెస్ డెస్క్ : కరోనా మహమ్మారి ఎఫెక్ట్ తర్వాత ఉద్యోగుల ఆరోగ్యంపై ప్రత్యేక ఫోకస్ పెడుతున్నాయి మన దేశంలోని కంపెనీలు. శారీరకంగా, మానసికంగా ఉద్యోగులు దృఢంగా ఉండేందుకు చొరవ తీసుకుంటున్నాయి. ఇందుకోసం తమ బడ్జెట్లను కూడా భారీగా పెంచుతున్నాయి. కరోనా మహమ్మారి ఎఫెక్ట్తో మన దేశంలోనూ వర్క్ కల్చర్ మారిపోయింది. ఇంటి నుంచి పనిచేయడం లేదా రిమోట్గా పనిచేయడం, ఆఫీసులకు వెళ్లేందుకు పట్టే సమయం ఎక్కువవడం, జీవన ఖర్చు పెరగడంతోపాటు కొవిడ్19 సంబంధ ఆరోగ్య సమస్యలతోనూ చాలా మంది ఇబ్బందులెదుర్కొంటున్నారు.
కరోనా ఎఫెక్ట్ ఇంకా పోలేదు....
కరోనా చాలా మంది ఉద్యోగుల మానసిక ఆరోగ్యంపై ఎఫెక్ట్ చూపింది. ఈ ఎఫెక్ట్ ఇప్పట్లో కనుమరుగయ్యే అవకాశాలు కూడా కనబడటం లేదు. దీంతో ఉద్యోగుల బాగోగులు కంపెనీలకు చాలా ఇంపార్టెంట్గా మారాయి. అన్ని రంగాలలోని కంపెనీలు తమ ఉద్యోగుల మంచి, చెడ్డలపై దృష్టి పెట్టడం విశేషం. వారంలో కొన్ని రోజులైనా ఉద్యోగులు ఇప్పుడు ఆఫీసులకు వచ్చే పనిచేస్తున్నారు.
ఉద్యోగులకు ఫైనాన్షియల్ సపోర్ట్...
ఉద్యోగులు మానసికంగానూ ఆరోగ్యంగా ఉండేందుకు 70 శాతానికి పైగా కంపెనీలు ఫైనాన్షియల్ సపోర్ట్ను పెంచాయి. స్ట్రెస్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్, ఇన్సూరెన్స్, పెయిడ్ టైమ్ ఆఫ్, హోమ్ రిలొకేషన్ సాయం వంటి బెనిఫిట్స్ఇ స్తున్నట్లు హెచ్ఆర్ సొల్యూషన్స్ కంపెనీ యోన్ డేటా వెల్లడిస్తోంది. 40 రంగాలలోని 1,300 కంపెనీల ఆగస్టు డేటా ఇందులో పొందుపరిచారు. ఆర్పీజీ గ్రూప్, ఐబీఎం ఇండియా, ఐసీఐసీఐ లాంబార్డ్, మైక్రోసాఫ్ట్, పీడబ్ల్యూసీ ఇండియా, కోల్గేట్ పామోలివ్ (ఇండియా), లోరీల్ ఇండియా, పేయు, ఫై మనీ వంటి కంపెనీలన్నీ ఉద్యోగుల బాగోగులపై ప్రత్యేక ఫోకస్ పెడుతున్నాయి.
క్రెష్, డేకేర్ సపోర్ట్ కూడా...
ఆఫీసులకు ఉద్యోగులు తిరిగి రావడంలో ఎదుర్కొంటున్న కొన్ని ఇబ్బందులు పరష్కారానికి కంపెనీలు సాయం అందిస్తున్నాయి. క్రెష్, డే కేర్ ఏర్పాటు వంటి వాటిని సొంతంగా ఏర్పాటు చేయడమో లేదా ఆ సదుపాయాలు అందించే టై అప్ పెట్టుకోవడమో కార్పొరేట్ కంపెనీలు చేస్తున్నాయి. అంతేకాదు, తమ పిల్లల కోసం ఉద్యోగులు క్రెష్, డే కేర్ వంటి వాటిపై వెచ్చించే మొత్తాన్ని రీయంబర్స్ కూడా చేస్తున్నాయి. ఇలాంటి కార్యకలాపాలపై దాదాపు 69 శాతం కంపెనీలు చొరవ తీసుకుంటున్నాయి. మెంటల్ వెల్నెస్ కంపెనీ జునో క్లినిక్లో ఆర్పీజీ గ్రూప్ పెట్టుబడులు పెట్టింది. ఈ క్లినిక్లలోని నిపుణుల వద్దకు ఆర్పీజీ గ్రూప్ఉద్యోగులు –వారి కుటుంబ సభ్యులు ఎలాంటి ఖర్చూ లేకుండానే వెళ్లొచ్చు. ఉద్యోగుల మానసిక ఆరోగ్యం, బాగోగులపై ఆర్పీజీ గ్రూప్ ఫోకస్ పెడుతోందని, వాటిపై సీరియస్గా దృష్టి పెడుతున్నామని ప్రెసిడెంట్ (గ్రూప్ హెచ్ఆర్) ఎస్. వెంకటేష్ చెప్పారు. ఇలాంటి వాటి కోసం గ్లోబల్గా ఉన బెస్ట్ ప్రాక్టీసెస్ను అమలు చేసే విషయంలో సీనియర్ లీడర్షిప్ వ్యక్తిగతంగా చొరవ తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇక పీడబ్ల్యూసీనైతే ఉద్యోగుల బాగోగుల కోసం ఒక పోర్టల్నే ఏర్పాటు చేసింది. అంతేకాదు, హెల్త్, ఇన్సూరెన్స్ సదుపాయాలనూ భారీగా పెంచింది. ఉద్యోగుల భౌతిక, మానసిక అవసరాలపై ఫోకస్ పెడుతున్నట్లు తెలిపింది.
మెంటల్ హెల్త్ కోసమూ సిక్ లీవులు..
తన సిక్ లీవ్ పాలసీలో మెంటల్ హెల్త్ను కూడా మైక్రోసాఫ్ట్ చేర్చింది. ఇందుకోసం సిక్ అండ్ మెంటల్ హెల్త్ లీవ్గా దాని పేరును కూడా మార్చేసింది. ఇక ఫిన్టెక్ రంగంలోని ఫై మనీ ఉద్యోగుల బాగోగుల కోసం అన్లిమిటెడ్ లీవులతో పాలసీ తీసుకొచ్చింది. ఇందులో మెంటల్ హెల్త్ కూడా భాగమే. ఉద్యోగులకు ఆటో అప్రూవల్తో లీవులు తీసుకునే సదుపాయాన్ని ఈ కంపెనీ అందిస్తోంది. తమ ఉద్యోగులపై తమకు పూర్తి విశ్వాసం ఉందని ఈ కంపెనీ పీపుల్ హెడ్ పూర్ణిమా కామత్ చెప్పారు. ఏ కారణం కోసమైనా ఉద్యోగులు సెలవు తీసుకోవాలనుకుంటే, అందుకు వారికి పూర్తి వెసులుబాటు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. మరో ఫిన్టెక్ కంపెనీ పేయు ఉద్యోగుల మానసిక ఆరోగ్యం కోసం 10 రోజుల ప్రత్యే క లీవ్ ప్రోగ్రామ్ను తెచ్చింది. వర్క్–లైఫ్ బాలెన్స్ కోసమే ఈ చొరవ తీసుకుంటున్నట్లు చీఫ్ పీపుల్ ఆఫీసర్ ప్రియా ఛెరియన్ చెప్పారు. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ పాలసీ తెచ్చామని, 40 ఎర్న్డ్ లీవులు లభిస్తాయన్నారు.