మెదక్‌‌‌‌లో హైర్‌‌‌‌‌‌‌‌ బస్‌‌‌‌ డ్రైవర్ల ఆందోళన

మెదక్‌‌‌‌లో  హైర్‌‌‌‌‌‌‌‌ బస్‌‌‌‌ డ్రైవర్ల ఆందోళన
  • ప్రయాణికుల ఇబ్బందులు 

మెదక్, వెలుగు: హైర్​బస్​డ్రైవర్ల ఆందోళనతో మెదక్‌‌‌‌ డిపో పరిధిలో దాదాపు 60 బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.  సోమవారం బొడ్మట్​పల్లి నుంచి మెదక్​ వస్తున్నబస్ డ్రైవర్‌‌‌‌‌‌‌‌పై టేక్మాల్​మండలం సాలోజిపల్లి వద్ద ఓ వ్యక్తి దాడికి ప్రయత్నించాడని హైర్​బస్​ డ్రైవర్​లు ఆరోపించారు.  

మహిళలకు ఫ్రీ జర్నీ అవకాశం కల్పించినప్పటి నుంచి బస్సుల్లో విపరీతంగా రద్దీ ఉంటోందని, ప్యాసింజర్​లు ఫుట్‌‌‌‌ బోర్డు పై నిల్చుంటుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు.  ఇది డ్రైవర్లకు ఇబ్బందికరంగా మారిందన్నారు. బస్ కెపాసిటీకి సరిపడ ప్యాసింజర్లను మాత్రమే ఎక్కించుకునేలా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకుంటేనే  తాము బస్‌‌‌‌లు నడిపిస్తామని హైర్​ బస్​ డ్రైవర్లు తెలిపారు.  ఆర్టీసీ అధికారులు వారితో చర్చలు జరిపి సమస్య లేకుండా చూస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.