Lok Sabha Elections 2024: 43 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ రెండో జాబితా

Lok Sabha  Elections 2024: 43 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ రెండో జాబితా

న్యూఢిల్లీ: 2024 లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల రెండో జాబితాను కాంగ్రెస్ మంగళవారం( మార్చి 12) ప్రకటించింది. మొత్తం 43 మంది అభ్యర్థుల పేర్లతో రెండో జాబితాను విడుదల చేసింది.  కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో రెండో జాబితాను ప్రకటించారు. 

 ఈ జాబితాలో జనరల్ కేటగిరీలో 10మంది, 13 మంది ఓబీసీలు, 10మంది షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులు, 9 మంది షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులు, ఒక ముస్లిం అభ్యర్థులు ఉన్నారు. రాజస్థాన్ లోని జలోర్ నుంచి రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట కుమారుడు వైభవ్, అసోం లోని జోర్హాట్ నుంచి గౌరవ్ గగోయ్ పోటీ చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. మధ్యప్రదేశ్ లోని చింద్వారా నుంచి మాజీ సీఎం కమల్ నాథ్ కుమారుడు నకుల్ పోటీ చేయనున్నారు.